నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ –
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీకి చెందిన గంగాధర్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాలుడి చికిత్స కోసం మంజూరైన 2 లక్షల 50వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ బాలుడి తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, దేవానంద్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అంతిరెడ్డి, భాస్కర్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *