
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెల్లాపూర్ మునిసిపాలిటీలోని ఎం.ఐ.జి కమ్యూనిటీ హాల్ లో మాజీ కౌన్సిలర్ శ్రీమతి పావని రవీందర్ గారి ఆధ్వర్యంలో స్త్రీ శక్తి మహిళ చైతన్య సంఘం ద్వారా ఒక నెలపాటు మహిళలు మరియు పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, మెహందీ, మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లీష్, MS ఆఫీస్, జుంబా డాన్స్ మరియు యోగా వంటి అనేక ప్రయోజనకరమైన కోర్సులు అందించబడ్డాయి.
అదేవిధంగా పిల్లల కోసం క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్, సంగీతం, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్, యోగా, ధ్యానం, నగల తయారీ, మట్టి పనులు, వినాయక విగ్రహాల తయారీ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వబడింది. ఇందులో ఒక ప్రత్యేక ఆకర్షణగా Ms Luma ఫ్యాషన్ షో కూడా నిర్వహించబడింది, ఇందులో పాల్గొన్న పిల్లలు తమ ప్రతిభను సమర్థంగా ప్రదర్శించారు.
ఒక నెలపాటు కొనసాగిన ఈ శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు మరియు బహుమతులను అందజేసే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి గారు శిక్షణార్థులకు అభినందనలు తెలియజేసి, శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ, తమ నేర్పును భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.