పహల్గాం దాడికి నిరసనగా బీరంగూడలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నందారం నరసింహ గౌడ్!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తాజా అమీనుపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ డిమాండ్‌ చేశారు. పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ హై టెన్షన్ రోడ్ లో ఎన్ ఎన్ జి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీలో తాజా మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేకమంది ప్రాణాలు బలి అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నారు. భారత్‌ వైపు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ప్రమోద్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కాలనీవాసులు, ఎన్ ఎన్ జి యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *