
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి వివాహ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఐజి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, తదితరులు పాల్గొన్నారు.