
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి నిర్మాణం కోసం తన తండ్రి కీర్తిశేషులు గూడెం సత్యరెడ్డి జ్ఞాపకార్థం ఐదు గుంటల సొంత స్థలం అందజేయడంతో పాటు, 20 లక్షల రూపాయల సొంత నిధులు అందజేసినట్లు ఎంఎల్ఏ జిఎంఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.