
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మాణ పనులకు పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు శంఖుస్థాపన చేశారు. నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని వర్తింప చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతిరావు, ఎంపీడీవో యాదగిరి, డి ఈ రవీందర్, ఏఈ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.