
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ శ్రీ సాయి యాక్సిస్ హోమ్ కాలనీలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న నూతన కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయల సొంత నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ నందారం నరసింహా గౌడ్ గారు, మాజీ ఎంపీపీ శ్రీ దేవానందం గారు, మాజీ జెడ్పిటిసి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీకాంత్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు